News

రుణమాఫీ 75 శాతం పూర్తి అయింది:పుల్ల..


రుణమాఫీ 75 ఐదు శాతం పూర్తి అయిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పడం విశేషంగా ఉంది. రైతుయాత్రలు చేస్తున్న రాహుల్, జగన్ లను రైతులు నమ్మబోరని ఆయన అన్నారు.తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు.అందువల్ల రైతు యాత్రలు చేసే అర్హత వారిద్దరికి లేదని పుల్లారావు అన్నారు.విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించిన విషయాల ప్రకారం ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం అనుకున్నట్లుగా రుణమాపీకి ఇరవై రెండు వేల కోట్ల పైన అవసరం. అందులో ఏడు కోట్లు ఇంతవరకు ఖర్చు చేశారని ఒక అంచనా. ఆ ప్రకారం చూసినా మూడో వంతు మాత్రమే ఖర్చు చేసినట్లు. ఒకవేళ యాబై వేల రూపాయల చొప్పున రుణమాఫీ చేసినందున 75 శాతం మంది రైతులకు మేలు జరిగిందని మంత్రి చెప్పదలిచారో ఏమో తెలియదు కాని,రుణమాఫీ ఏకంగా డెబ్బై ఐదు శాతం పూర్తి అయిందని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంటుంది.